Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినీ నటి జయప్రదకు షాక్ - ఈఎస్ఐ స్కామ్‌లో ఆర్నెల్ల జైలు : చెన్నై కోర్టు తీర్పు

jayaprada
, శుక్రవారం, 11 ఆగస్టు 2023 (14:31 IST)
సినీ నటి జయప్రదకు షాక్ తగిలింది. ఈఎస్ఐ స్కామ్‌లో ఆమెకు ఆర్నెల్ల జైలు శిక్షి విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. చెన్నై ఎగ్మోర్ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, చెన్నై రాయపేటలో జయప్రదకు జయప్రద, రాజ్ అనే పేర్లతో రెండు థియేటర్లు ఉండేవి. వీటిని ఆమె సోదరులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే, ఈ థియేటర్లలో పని చేసిన కార్మికులకు సంబంధించిన ఈఎస్ఐ సొమ్మును సంబంధింత ఖాతాలో యాజమాన్యం జమ చేయలేదు. 
 
అంటే కార్మికుల ఈఎస్ఐ కోసం వసూలు చేసిన మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు యాజమాన్యం చెల్లించలేదు. దీనిపై ఇటు కార్మికకులు, అటు కార్పొరేషన్ స్థానిక ఎగ్మోర్ కోర్టుకు ఆశ్రయించింది. ఈ కేసు విచారణ సమయంలో కార్మికులకు చెల్లించాల్సిన మొత్తాన్ని బయట సెటిల్ చేసుకుంటామని, ఆ మొత్తం వెంటనే చెల్లించేందుకు సిద్ధమని జయప్రద తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే విషయాన్ని వివరిస్తూ కోర్టులో మూడు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. 
 
అయితే, ఎగ్మోర్ కోర్టు ఈ పిటిషన్లను తోసిపుచ్చింది. లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లాయర్ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని కేసును కొనసాగించింది. సుదీర్ఘ విచారణ తర్వాత శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. జయప్రదతో పాటు ముగ్గురికి ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.5 వేల అపరాధం చొప్పున విధిస్తూ తీర్పునిచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్రానికి ఫిర్యాదు చేస్తే వణికిపోతామా? మంత్రి గుడివాడ