Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్భస్థ శిశువును కూడా వదిలిపెట్టని కరోనా మహమ్మారి..

Advertiesment
Covid
, శనివారం, 17 ఏప్రియల్ 2021 (15:51 IST)
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా కడుపులో వున్న గర్భస్థ శిశువును కూడా కరోనా వదల్లేదు. తల్లి నుండి కడుపులో ఉన్న బిడ్డకు కూడా కరోనా మహమ్మారి సోకింది. ఈ ఘటన హర్యానాలో జరిగింది. ఇప్పటిదాకా తల్లి కడుపులోని బిడ్డకు కరోనా సోకదని చాలా మంది నిపుణులు చెప్తూ వున్నారు. తాజాగా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో నిపుణులు కూడా షాక్ అవుతూ ఉన్నారు.
 
కరోనా పాజిటివ్ ఉన్న ఓ మహిళ కరోనా పాజిటివ్ ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. తొలుత ఆమె భర్తకు కరోనా పాజిటివ్ రాగా.. ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమెకూ పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే పురిటి నొప్పులు రావడంతో పలు ఆసుపత్రులకు తిరిగారు. చాలా ప్రైవేట్ ఆసుపత్రులు ఆమెను చేర్చుకునేందుకు అంగీకరించలేదు.
 
ఆయుష్మాన్ భవ్ ఆసుపత్రి యాజమాన్యం ఆమెను చేర్చుకుని ప్రసవం చేసింది. తర్వాత పుట్టిన బిడ్డకూ కరోనా ఉన్నట్టు గుర్తించి డాక్టర్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా అరుదు అని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాల్సిందేనని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యతో సంసారం, కుమార్తెపై అత్యాచారం, సవతి తండ్రి దారుణం