Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామకృష్ణ ఆశ్రమంలో అమానుష చర్య : పెన్ను దొంగిలించాడని థర్డ్ క్లాస్ బాలుడిని చితకబాదారు...

harassment

వరుణ్

, సోమవారం, 5 ఆగస్టు 2024 (10:45 IST)
కర్నాటక రాష్ట్రంలోని రాయ్‌చూర్‌లో ఉన్న రామకృష్ణ ఆశ్రయంలో అమానుష చర్య జరిగింది. పెన్ను దొంగిలించాడన్న అనుమానంతో మూడో తరగతి చదువుతున్న బాలుడుని చితకబాదారు. ఆశ్రమ మేనేజర్, ఆయన ఇద్దరు సహాయకులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,  
 
మూడేళ్ల బాధిత బాలుడి పేరు తరుణ్ కుమార్. రాయచూర్‌లోని రామకృష్ణ ఆశ్రమంలో ఉంటున్నాడు. ఆశ్రమ ఇన్‌చార్జ్ వేణుగోపాల్, ఆయన సహాయకులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధిత బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. 'ఇద్దరు అబ్బాయిలు, టీచర్ కొట్టారు. కర్రతో కొట్టినప్పుడు అది విరిగిపోయింది. అప్పుడు బ్యాట్‌తో కొట్టారు. శరీరంపై గాయాలు కూడా చేశారు. ఆ తర్వాత యాద్గిర్ తీసుకెళ్లి రైల్వే స్టేషన్ వద్ద అడుక్కోమన్నారు. కానీ, ఎవరూ డబ్బులు ఇవ్వలేదు' అని తరుణ్ చెప్పుకొచ్చాడు. పెన్ను కోసమే తనను కొట్టారని పేర్కొన్నాడు.
 
దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కళ్లు పూర్తిగా ఉబ్బిపోయాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో బాలుడిని అతడి తల్లిదండ్రులు ఆశ్రమంలో వేశారు. తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటుండగా ఓ పెన్నును దొంగిలించాడు. ఈ విషయాన్ని వారు ఆశ్రమ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కోపంతో ఊగిపోయిన వేణుగోపాల్, మరో ఇద్దరు కలిసి తరుణ్ పై దారుణంగా దాడిచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాయ్ - బిస్కెట్స్ అంటూ స్నాక్స్ రూపంలో రూ.3 కోట్లు బొక్కేసిన వైకాపా నేతలు.. ఎక్కడ?