Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరువేల కోట్లు సరెండర్ చేసేసిన లాల్జీభాయ్ పటేల్? అంతా రూ.500, రూ.1000 నోట్లే!

ఆరువేల కోట్లు మీరు కళ్లారా చూశారా? ఈ మొత్తాన్ని చూసేందుకు మన కళ్లు ఏమాత్రం చాలవు. నల్లధనం నియంత్రణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో ఓ గుజరాతీ నగల వ్యాపారి ప్రభుత్వానికి రూ.6వేల కోట్లను

ఆరువేల కోట్లు సరెండర్ చేసేసిన లాల్జీభాయ్ పటేల్? అంతా రూ.500, రూ.1000 నోట్లే!
, మంగళవారం, 15 నవంబరు 2016 (09:14 IST)
ఆరువేల కోట్లు మీరు కళ్లారా చూశారా? ఈ మొత్తాన్ని చూసేందుకు మన కళ్లు ఏమాత్రం చాలవు. నల్లధనం నియంత్రణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో ఓ గుజరాతీ నగల వ్యాపారి ప్రభుత్వానికి రూ.6వేల కోట్లను సరెండర్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఆ మొత్తం రూ.500, 1000 నోట్ల రూపంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా కార్లు.. ఫ్లాట్లు కొనిస్తూ వార్తల్లో నిలుస్తున్న లాల్జీభాయ్‌ పటేల్ అనే వ్యాపారి తన వద్ద ఉన్న భారీ మొత్తాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేసేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటనకు వచ్చినప్పుడు మోడీ ధరించిన రూ.10 లక్షల సూట్‌ను వేలంలో రూ.4.3 కోట్లకు కొన్న కుబేరుడు కూడా ఇతనేనని తెలిసింది. 
 
భారత దేశంలోనే అత్యంత సంపన్నుడైన లాల్జీభాయ్.. నగలు, రత్నాల వ్యాపారాలు చేసేవాడు. గతంలో బాలికల విద్య కోసం రూ.200 కోట్లు విరాళంగా ఇచ్చి అందరి మెప్పూ పొందారు. అలాంటి వ్యక్తి రూ.6వేల కోట్లను  సరెండర్ చేసేశారని వార్తలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోట్ల రద్దు.. బ్యాంక్ క్యూలో అర్ధనగ్నంగా యువతి హంగామా.. డబ్బులివ్వలేదని..?