Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాయంత్రం పెళ్లి.. సెల్ ఫోన్‌ చూస్తూ.. రైల్వే ట్రాక్ దాటాడు.. క్షణాల్లో?

సాయంత్రం పెళ్లి కొడుకు కావాల్సింది.. కానీ ఆ టెక్కీ ఉదయమే ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సెల్‌ఫోనే కారణమైంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, నందోసి గ్రామానికి చెందిన నరేశ్‌పాల్ గంగ్వార్ (30

Advertiesment
Bareilly groom
, మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (09:05 IST)
సాయంత్రం పెళ్లి కొడుకు కావాల్సింది.. కానీ ఆ టెక్కీ ఉదయమే ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సెల్‌ఫోనే కారణమైంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, నందోసి గ్రామానికి చెందిన నరేశ్‌పాల్ గంగ్వార్ (30) ఇంజినీరు. ఇటీవల వివాహం నిశ్చయమైంది. సోమవారం సాయంత్రం నరేశ్ పాల్ వివాహం జరగాల్సింది. కానీ పెళ్లికి ముందు స్నేహితులతో మాట్లాడుతూ.. పెళ్లికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటున్నాడు.
 
మరో సెల్ ఫోన్‌లో మెసేజ్‌లు పంపుతూ రైల్వే ట్రాక్ దాటాడు. అంతే దారుణం జరిగిపోయింది. చిన్నపాటి ఏమరుపాటు వల్ల అతడి శరీలం ఛిద్రమైంది. పట్టాలు దాటుతుండగా యువకుడి రైలు ఢీకొంది. పెళ్లి కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో పెళ్లి వారింట విషాదం నెలకొంది. ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పెళ్లికుమార్తె షాక్ అయ్యింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌కు అంత సీన్ లేదు... చివరి అస్త్రంగా అవిశ్వాసం : చంద్రబాబు