Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌కు అంత సీన్ లేదు... చివరి అస్త్రంగా అవిశ్వాసం : చంద్రబాబు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర హక్కులను సాధించుకునేంత సీన్ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి లేదని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

జగన్‌కు అంత సీన్ లేదు... చివరి అస్త్రంగా అవిశ్వాసం : చంద్రబాబు
, మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (09:04 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర హక్కులను సాధించుకునేంత సీన్ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి లేదని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేసులకు భయపడి కేంద్రానికి భజన చేస్తున్నారంటూ మండిపడ్డారు. అదేసమయంలో తాము ఎన్డీయే నుంచి వైదొలిగితే ఆయన అక్కడ చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. 
 
మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ, ఎంపీలు తక్కువగా ఉన్న కారణంగా మనం అవిశ్వాస తీర్మానం పెట్టలేమ‌ని, అయితే, అవసరమైతే అన్ని పార్టీల సాయం తీసుకుని అవిశ్వాసం దిశగా వెళతాన‌ని అన్నారు. కానీ, అది చివరి ప్రయత్నంగా మాత్ర‌మే ప్రయోగించాలని చెప్పారు.
 
అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 54 మంది ఎంపీలు ఉండాలన్నారు. తాను అవిశ్వాస తీర్మానం వల్ల లాభం లేదని అన్నానని కొందరు అంటున్నారని, తాను అలా అనలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, అన్ని పోరాటాలు చేసిన తరువాత ఆ ప్ర‌య‌త్నం చేయాల‌ని తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తారో ప్యాకేజీ నిధులు ఇస్తారో కేంద్ర ప్రభుత్వం తేల్చుకోవాలని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీకే చింపేశారు.. శభాష్ అంటూ మహేష్ కత్తి ప్రశంసలు