Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోల్‌కతా మెడికో పోస్టుమార్టం నివేదికలో ఏముంది?

medicos agitation

ఠాగూర్

, సోమవారం, 19 ఆగస్టు 2024 (15:41 IST)
కోల్‌కతా కేఆర్జీ కారా వైద్య కాలేజీ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన జూనియర్ మహిళా డాక్టర్ మృతదేహాం పోస్టుమార్టం నివేదిక వచ్చింది. ఇందులో అనేక కీలక విషయాలను వైద్యులు వెల్లడించారు. ఈ పోస్టుమార్టం నివేదికలో జూనియర్ వైద్యురాలి మృతికి కారణం ఊపిరి ఆడకపోవడమేనని నివేదికలో పేర్కొన్నారు. గొంతు నులమడం వల్ల చనిపోయి ఉండొచ్చని పేర్కొంది. పలు జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన కథనాల ప్రకారం ఆర్జీ కర్ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్ ఊపిరి ఆడకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. 
 
బాధితురాలిపై అత్యాచారం జరిగిన ఆనవాళ్ళు స్పష్టంగా ఉన్నాయి. అదేవిధంగా మృతురాలి శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం కనిపించిందని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. మృతదేహంపై తెల్లటి చిక్కటి ద్రవం కనిపించిన మాట వాస్తవమే కానీ అది వీర్యం కాదని స్పష్టం చేసింది. అయితే, అదేమిటన్నది ఈ రిపోర్టు వెల్లడించలేదు. మృతదేహంలో పలు ఎముకలు విరిగాయనే ఆరోపణలను తోసిపుచ్చింది. ఎముకలు విరిగిన ఆనవాళ్లు ఏమీ లేవని క్లారిటీ ఇచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీలో చేరిన వైకాపా మాజీ నేత దారుణ హత్య...