Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారణాసిలో మోదీకి పోటీగా ప్రియాంకా గాంధీనా...? అవసరమా?

వారణాసిలో మోదీకి పోటీగా ప్రియాంకా గాంధీనా...? అవసరమా?
, గురువారం, 25 ఏప్రియల్ 2019 (14:18 IST)
ఉత్తరప్రదేశ్, వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ కీలక నేత ప్రియాంకా గాంధీ ఎదుర్కోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ తరపున అజయ్ రాయ్ వారణాసిలో మోదీతో పోటీగా బరిలోకి దిగుతున్నారు. వారణాసి నియోజకవర్గానికి గాను.. బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. శుక్రవారం ఈ మేరకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో వారణాసిలో మోదీతో బరిలోకి దించే అభ్యర్థి పేరును కాంగ్రెస్ ప్రకటించకుండా సస్పెన్స్‌లో వుంచింది. అయితే వారణాసిలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీని పోటీకి దించుతారని జోరుగా ప్రచారం సాగింది. ప్రియాంక గాంధీ ఈ నెల 29వ తేదీ నామినేషన్ దాఖలు చేసే అవకాశం వున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ వారణాసిలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థిని ఆ పార్టీ గురువారం ప్రకటించింది.
 
ఇందులో భాగంగా అజయ్ రాయ్ పేరును తెరపైకి తెచ్చింది. గోరఖ్ పూర్ నియోజకవర్గంలో మదుసూధన్ తివారీ పోటీ చేస్తున్నట్లు కూడా కాంగ్రెస్ ప్రకటన చేసింది. దీంతో వారణాసిలో ప్రియాంక గాంధీ పోటీకి దించే విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని టాక్ వస్తోంది. మోదీతో ప్రియాంక పోటీ వద్దని కాంగ్రెస్ సీనియర్ నేతలు సలహా ఇవ్వడంతోనే ఆమెను మోదీ పోటీ చేసే వారణాసిలో బరిలోకి దించలేదని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదేళ్ళ కాలంలో మూడు రెట్లు పెరిగిన మమతా బెనర్జీ మేనల్లుడి ఆస్తులు