Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువతికి టీలో మత్తుమందు ఇచ్చి మూడేళ్ల పాటు..?

యువతికి టీలో మత్తుమందు ఇచ్చి మూడేళ్ల పాటు..?
, శుక్రవారం, 21 మే 2021 (17:13 IST)
యువతికి టీలో మత్తుమందు కలిపి ఇచ్చి మూడేళ్ళ పాటు అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. ఈ ఘటన ముంబై మహానగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 35 ఏళ్ల వ్యక్తికీ సోషల్ మీడియాలో ఓ యువతి పరిచయమైంది. కొద్దికాలానికి ఇద్దరు మంచి స్నేహితులయ్యారు.
 
ఒకరోజు యువతిని ఆహ్వానించి.. అతిధి మర్యాదగా యువతికి టీ ఇచ్చాడు. అయితే అందులో మత్తుమందు కలిపాడు.. ఆ టీ తాగిన యువతి సృహతప్పి పడిపోయింది. ఆమె స్పృహ కోల్పోయిన తరువాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
మత్తు వీడిన తరువాత స్పృహలోకి వచ్చిన యువతి అసలు విషయం తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. దీంతో సదరు వ్యక్తి ఆమెను అడ్డుకున్నాడు.. ఓ వీడియో చూపించాడు.. దీంతో యువతి షాక్‌కి గురైంది. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఆ దృశ్యాలను తన ఫోన్‌లో బంధించాడు.
 
దీంతో యువతి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. వీడియో డిలీట్ చెయ్యాలని బ్రతిమాలింది అయినా అతడు వినలేదు. వీడియోను అడ్డంపెట్టుకొని అనేక సార్లు యువతిపై లైంగికదాడి చేశాడు.
 
కొన్నిసార్లు మళ్లీ వీడియో తీసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. శారీరకంగా హింసించాడు. దీంతో వేధింపులు తట్టుకొని యువతి కుటుంబ సభ్యులకు తెలిపింది. 
 
వారు పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. విచారణలో తాను చేసిన తప్పు ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరు ఆయుర్వేద మందు: ఆయుష్ ఇన్ ఛార్జ్ మంత్రి, ఐ.సి.ఎం.ఆర్. డైరక్టర్ జనరల్‌తో మాట్లాడిన ఉపరాష్ట్రపతి