Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరుజన్మలో శివుడి భార్య పార్వతిగా పుట్టాలని ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

ఆ యువతి పీజీ పూర్తి చేసింది. దైవారాధన ఎక్కువ. మతపరమైన నమ్మకాలంటే మరీ గుడ్డిగా నమ్మేస్తుంది. పేరు అనిష శర్మ. వయసు 22 సంవత్సరాలు. వచ్చేజన్మలో శివుడికి భర్యగా పుట్టాలని శివుడి గుడిలోనే తనువు చాలించింది.

Advertiesment
మరుజన్మలో శివుడి భార్య పార్వతిగా పుట్టాలని ఆ యువతి ఏం చేసిందో తెలుసా?
, శనివారం, 7 జనవరి 2017 (15:08 IST)
ఆ యువతి పీజీ పూర్తి చేసింది. దైవారాధన ఎక్కువ. మతపరమైన నమ్మకాలంటే మరీ గుడ్డిగా నమ్మేస్తుంది. పేరు అనిష శర్మ. వయసు 22 సంవత్సరాలు. వచ్చేజన్మలో శివుడికి భర్యగా పుట్టాలని శివుడి గుడిలోనే తనువు చాలించింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
గుర్గావ్ సమీపంలోని షేర్పూర్ గ్రామానికి చెందిన అనిష శర్మ అనే యువతికి దైవారాధన ఎక్కువ. వచ్చే జన్మలో పార్వతిదేవిగా పుట్టాలని భావించింది. ఇందుకోసం తాను ఈ తాత్కాలిక ప్రపంచంలో ఉండలేకే తనువు చాలిస్తున్నట్లు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. అదీ కూడా శివుడి గుడిలోనే. 
 
ఈ విషయాన్ని గమనించిన ఆలయ పూజారి గోపాల్ దాస్ స్థానికులకు సమాచారం చేరవేశాడు. ఆ వెంటనే స్థానికులకు వచ్చి ఆ యువతిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. 
 
ఘటనా స్థలంలో యువతి పర్సు, మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. పర్సులో ఓ లేఖ కనిపించింది. మరుజన్మలో శివుడి భార్య పార్వతిగా అవతరించాలని, అందుకే ఈ తాత్కాలిక ప్రపంచంలో ఉండలేకే తనువు చాలిస్తున్నానని, శివుడు తన కోరిక నెరవేర్చాలని వేడుకొంటున్నట్లు ఆ లేఖలో రాసి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

125 కోట్ల మంది ప్రజలను బకరాలను చేసిన నరేంద్ర మోడీ... కరెన్సీ నోట్ల రద్దు వెనక పెద్దన్న హస్తం!?