Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పైనే చర్య.. పేటీఎం యాప్‌పై కాదు.. ఆర్బీఐ

Paytm

సెల్వి

, గురువారం, 8 ఫిబ్రవరి 2024 (16:48 IST)
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్‌)కి వ్యతిరేకంగా ఇటీవల జారీ చేయబడిన ఉత్తర్వు ద్వారా పేటీఎం యాప్ ప్రభావితం కాదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) పేర్కొంది. ఆర్బీఐ ఆదేశాలు కేవలం క్లారిటీ కోసమేనని ఆ చర్య పేటీఎం Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై ఉంది. కానీ పేటీఎం యాప్‌పై కాదు. ఈ చర్య ద్వారా యాప్ ప్రభావితం కాదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ మీడియా సమావేళంలో చెప్పారు. 
 
ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కావాలనే బ్యాంకుల నిర్ణయం వ్యాపార నిర్ణయమని, పీపీబీఎల్‌తో సహకరించడంలో బ్యాంకుల స్వయంప్రతిపత్తిని సూచిస్తుందని స్వామినాథన్ తెలిపారు. 
 
ఇటీవలి చర్యలు స్పష్టంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వైపు మళ్లించబడ్డాయని, పేటీఎం యాప్  కార్యాచరణ లేదా కార్యకలాపాలను ప్రభావితం చేయవని డిప్యూటీ గవర్నర్ నొక్కిచెప్పారు. విస్తృత శ్రేణి డిజిటల్ చెల్లింపు సేవల కోసం పేటీఎంపై ఆధారపడే మిలియన్ల మంది వినియోగదారులకు ఈ స్పష్టత భరోసానిస్తోంది.
 
దీనిపై పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ.. పేటీఎం యాప్ పూర్తిగా పనిచేస్తుందని, పేటీఎం మొబైల్ చెల్లింపుల్లో అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ నిరంతరాయ సేవలను అందించడానికి బ్యాంకులతో మా భాగస్వామ్యాన్ని వేగవంతం చేస్తున్నాము. పేటీఎం క్యూఆర్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్‌లు ఎప్పటిలాగే పని చేస్తూనే ఉంటాయని హామీ ఇచ్చారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనం : ఇండియా టుడే సర్వే