Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సరికొత్త ఏఐ ఫీచర్లతో గూగుల్ నుంచి పిక్సెల్ 9 సిరీస్

Google Pixel 9

సెల్వి

, బుధవారం, 14 ఆగస్టు 2024 (10:16 IST)
Google Pixel 9
సరికొత్త ఏఐ ఫీచర్లతో గూగుల్ నుంచి పిక్సెల్ 9 సిరీస్ భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి గూగుల్ రంగం సిద్ధం చేసుకుంది. గూగుల్, ఫ్లిఫ్ కార్ట్ ద్వారా సేల్ ఆరంభించింది. 
 
గూగుల్ యాజమాన్యంలోని మూడు వాక్-ఇన్ సెంటర్‌లను ప్రారంభించింది. ఇది 15 నగరాల్లోని 150 రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ ఎల్  కోసం ప్రీ-ఆర్డర్‌లు బుధవారం నుండి ప్రారంభమవుతాయి.
 
ఈ పరికరాలు ఆగస్టు 22 నుండి అందుబాటులో ఉంటాయి. పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్, పిక్సెల్ వాచ్ 3, పిక్సల్ బడ్స్ ప్రో2ని కూడా ఆవిష్కరించింది. ఇది సంవత్సరం తర్వాత అందుబాటులోకి వస్తుంది. భారతదేశంలో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ ధర వరుసగా రూ. 79,999, రూ. 1,09,999, రూ. 1,24,999లకు లభిస్తుంది.
 
గూగుల్ తన మునుపటి తరం పిక్సెల్ ఫోన్‌ల ధరలను భారతదేశంలో తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ప్రకారం, పిక్సెల్ 9 ఫోన్‌లు ఏఐ నుండి సరికొత్త ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. Pixel 9 Pro (6.3-inch), Pixel 9 Pro XL (6.8-inch) ఈ రెండు డివైజ్‌లు ఇంకా ప్రకాశవంతమైన సూపర్ యాక్చువా డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. 
 
షార్ప్, ప్రకాశవంతమైన తక్కువ-కాంతి ఫోటోల కోసం కొత్త 42 MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉన్నాయి. Pixel 9 6.3-అంగుళాల Actua డిస్‌ప్లేను అందిస్తుంది. Pixel 8 కంటే 35 శాతం ప్రకాశవంతంగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ రైతులకు శుభవార్త... 15 నుంచి మూడో విడత రుణమాఫీ...