Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

IPL 2024 ప్లేఆఫ్‌: టాప్-2 కోసం చెన్నై-సన్ రైజర్స్ పోటీ.. రాజస్థాన్‌కు ఢోకాలేదు..

CSK_SRH

సెల్వి

, గురువారం, 16 మే 2024 (12:27 IST)
CSK_SRH
ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం గౌహతిలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమి చెందడంతో టాప్-2లో చేరాలనే వారి ఆశలను నీరుగార్చింది. రాయల్స్‌ను అధిగమించే అవకాశాలను సన్‌రైజర్స్, చెన్నైసూపర్ కింగ్స్ ఆశించాయి. ఇంతలో కేకేఆర్ అగ్రస్థానానికి చేరుకుంది.
 
రెండు జట్లు ఇప్పటికే IPL 2024 ప్లేఆఫ్స్‌లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాయి. ఇంకా కేకేఆర్ టేబుల్ పట్టికలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ ఈ టోర్నీ నాకౌట్ దశలకు ముందు నాలుగు-మ్యాచ్‌ల వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. 
 
బుధవారం గౌహతిలో సంజూ శాంసన్ ఆటతీరుతో ఆటాడుకున్నాడు. ఫలితంగా నైట్ రైడర్స్‌కు మొదటి స్థానం లభించింది. రాయల్స్ చివరి పతనం కారణంగా పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే వారి ఆశలు డైలమాలో పడ్డాయి. 
 
ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో రాజస్థాన్ 13 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఏది ఏమైనప్పటికీ, రాజస్థాన్‌ను వెనక్కి నెట్టి మొదటి రెండు స్థానాల్లోకి ప్రవేశించడానికి చెన్నై, సన్ రైజర్ జట్లు పోటీలో ఉన్నాయి.
 
అయినా రాజస్థాన్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐపిఎల్ 2024 సీజన్ మొదటి అర్ధభాగంలో 2008 ఛాంపియన్‌ అయిన రాజస్థాన్ అజేయంగా నిలిచింది. తొలి 9 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో అగ్రస్థానంలో ఉంది. 
 
ఇకపోతే.. లీగ్ దశలో టాప్ 2లో నిలిచిన జట్లకు ఫైనల్‌కు చేరుకోవడానికి రెండు అవకాశాలు ఉన్నాయి. ప్లేఆఫ్స్‌లో క్వాలిఫైయర్ విజేత ఫైనల్ చేరుకుంటాడు. రాజస్థాన్‌కు ఇప్పటికీ సమీకరణం చాలా సులభం. మే 19న గౌహతిలో కేకేఆర్‌తో జరిగే చివరి లీగ్ గేమ్‌లో గెలిస్తే, వారు మొదటి రెండు స్థానాల్లో స్థానం పొందడం ఖాయం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సన్‌రైజర్స్-జీటీ మ్యాచ్ కోసం 60 ప్రత్యేక టీఎస్సార్టీసీ బస్సులు