Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరేబియన్ దీవులకు వివాహర యాత్రకు వెళ్లిన భారత సంతతి విద్యార్థి మాయం!

Advertiesment
missing

ఠాగూర్

, సోమవారం, 10 మార్చి 2025 (11:59 IST)
కరేబియన్ దీవులకు విహార యాత్రకు వెళ్ళిన భారతీయ సంతతికి చెందిన ఓ విద్యార్థిని అదృశ్యమయ్యారు. అమెరికాలోని పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో సుదీక్ష కోణంకి అనే విద్యార్థిని విద్యాభ్యాసం చేస్తుంది. ఈమె గతవారం తన స్నేహితులతో కలిసి కరేబియన్ దీవులకు విహారయాత్రకు వెళ్లింది. 
 
డొమినికన్ రిపబ్లికన్‌లోని ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటాకానా ప్రాంతానికి సుదీక్షతో పాటు ఆమె స్నేహితులంతా వెళ్లారు. ఈ నెల 6వ తేదీన రియా రిపబ్లికా రిసార్ట్ వద్ద బీచ్ వెంట నడుచుకుంటూ వెళ్లింది. ఆ తర్వాత ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. 
 
భారతదేశానికి చెందిన సుదీక్ష కోణంకి తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాసం హోదా పొందారు. 20 యేళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి ప్రస్తుతం పిట్స్‌బర్గ్ వర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

SLBC Tunnel: కేరళ నుంచి అవి వచ్చాయ్.. రెండు మృతదేహాల గుర్తింపు