Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా.. ఆస్ట్రేలియా కఠిన నిర్ణయం.. ఏంటది?

Advertiesment
Australians
, శనివారం, 1 మే 2021 (10:57 IST)
దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దేశం నలుమూలలా వైరస్ విరుచుకుపడుతోంది. మునుపెన్నడూ లేనంత ఉధృతితో వ్యాపిస్తుండటంతో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 4 లక్షలు దాటాయి.
 
ప్రపంచ వ్యాప్తంగా ఒక రోజులో ఇంత అత్యధిక కేసులు నమోదవడం, అదీ భారత్ లోనే చోటు చేసుకోవడం పరిస్థతి తీవ్రతను తెలుపుతోంది. గత 24 గంటల్లో శుక్రవారం.. 4,01,993 కేసులు నమోదయ్యాయి.
 
ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు భారత్ నుంచి రాకపోకలపై నిషేధం విధించాయి. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ఠ్యా విషయం తెలిసిందే. దీంతో భారత్‌లో 14 రోజులు ఉండి ఆస్ట్రేలియా వచ్చే తమ పౌరులకు 5 ఏండ్లు వరకు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. 
 
బయోసెక్యూరిటీ యాక్ట్ కింద ఆస్ట్రేలియ చర్యలు చేపట్టింది. స్వదేశీ పౌరులపై ఈ తరహా కఠినమైన ఆంక్ష విధించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత్ నుంచి ప్రయాణాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం మూడు వారాల క్రితమే తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్ను భారత్‌కు పంపించకండి.. బ్రిటన్ హైకోర్టులో పిటీషన్.. నీరవ్ మోదీ