Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జోహెన్స్‌బర్గ్‌ భవనంలో మంటలు.. 52మంది సజీవదహనం

, గురువారం, 31 ఆగస్టు 2023 (13:44 IST)
దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో ఓ బహుళ అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగి 52 మంది మరణించారు. మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఇప్పటి వరకు 52 మృతదేహాలను వెలికి తీసినట్టు అధికారులు పేర్కొన్నారు. 
 
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అది తాత్కాలిక నివాసమని, ఎలాంటి లీజ్ అగ్రిమెంట్ లేకుండా ఇక్కడ ప్రజలు నివసిస్తున్నట్టు ఎవర్జెన్సీ సర్వీస్ అధికారులు తెలిపారు. ఆ భవనంలో కనీసం 200 మంది నివసిస్తున్నట్టు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రయాన్ -3: ఇస్రోకు ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటి వరకు ఏం సమాచారం ఇచ్చింది?