Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు - 40 మంది మృతి.. 100 మందికి గాయాలు

gaza strip

సెల్వి

, శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (11:22 IST)
గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 40 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇంకా వందమంది గాయపడినట్లు గాజాలోని హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
డెయిర్ ఎల్-బలాహ్ నగరంలోని అనేక నివాస గృహాలపై ఇజ్రాయెల్ విమానం గురువారం దాడులు ప్రారంభించింది. ఈ ఘటనలో వందమంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది బాధితుల మృతదేహాలను అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రికి తరలించినట్లు హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
ఇజ్రాయెల్ దాడులతో చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత ప్రజలను రక్షించేందుకు అంబులెన్స్‌లు, సివిల్ డిఫెన్స్ బృందాలు దాడులు జరిగిన ప్రదేశానికి చేరుకున్నాయని భద్రతా వర్గాలు తెలిపాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలోనే పుస్తకాలూ చూసి పరీక్షలు రాసే విధానం.. ఎక్కడ?