ఎవడులో అల్లు అర్జున్ చనిపోతాడా?
, శుక్రవారం, 28 జూన్ 2013 (18:02 IST)
రచ్చ, నాయక్ సక్సెస్ల తర్వాత రామ్ చరణ్ హీరోగా, శ్రుతి హాసన్, అమీజాక్సన్లు హీరోయిన్లుగా.. మున్నా, బృందావనం చిత్రాలను అందించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అనిత సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు తెరకెక్కిస్తున్న చిత్రం ఎవడు. ఇందులో అల్లు అర్జున్ గెస్ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన కాజల్ నటిస్తోంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ .ఎవడు సినిమాను 'ఫేస్ ఆఫ్' అనే ఆంగ్ల సినిమాను ఆధారంగా చేసుకొని నిర్మిస్తున్నారని సినీవర్గాలు అనుకుంటున్నారు. ఇందులో అల్లు అర్జున్ పాత్రధారి చనిపోతాడు. మరి ఎవడులో కూడా అల్లు అర్జున్ చేసిన పాత్ర చనిపోతుందా అనే వార్తపై మెగా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. నిజానికి 'ఠాగూర్' తమిళ వెర్షన్లో హీరో విజయకాంత్ చనిపోతాడు. కాని మన తెలుగు ఫ్యాన్స్ ఒప్పుకోరని ఠాగూర్లో చిరంజీవి పాత్ర చనిపోకుండా స్క్రిప్ట్ మార్చారు. మరి ఇప్పుడు నిజంగానే ఎవడు సినిమాలో అల్లు అర్జున్ చనిపోతే మెగా ఫ్యాన్స్ ఒప్పుకుంటారో లేదో వేచి చూడాలి?