రామ్ చరణ్, సమంతల 'ఎవడు' షూటింగ్ ఫిబ్రవరి 23న
Publish Date: Fri, 20 Jan 2012 (16:20 IST)
Updated Date: Fri, 20 Jan 2012 (16:19 IST)
రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్రాజు నిర్మిస్తున్న చిత్రం 'ఎవడు' రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 23 నుంచి జరుగుతుంది. సమంత కథానాయికగానటిస్తోంది. మరోనటి బాలీవుడ్లో జెస్సీగా పేరుపొందిన జాన్సన్ మరో కథానాయిక. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, వంశీపైడిపల్లి, రామ్చరణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు. మదరాసి పట్నం ఫేమ్ అమీజాక్సన్ నటిస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోంది. వంశీ మా సంస్థలో హ్యాట్రిక్ విజయాన్ని సాధించేలా చర్యలు తీసుకుంటున్నాడు. దేవీశ్రీప్రసాద్ సంగీతం చిత్రానికి హైలైట్గా నిలుస్తుంది.యాక్షన్, వినోదాన్ని సమపాళ్ళలో అందిస్తున్నాం. ఎన్నో రకాల థ్రిల్స్ ఇందులో ఉంటాయి. ప్రేక్షకులకు తప్పక నచ్చుతుంది అన్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.