Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫుల్ కిక్కు.. మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏంటది?

Advertiesment
Andhra Pradesh
, శుక్రవారం, 25 డిశెంబరు 2020 (10:23 IST)
ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ కిక్కేచ్చేసింది. డిసెంబర్ 31, జనవరి 1 రోజున మద్యం షాపులపై ఎలాంటి నిషేధం లేదని రాష్ట్ర బీవరేజెస్ కార్పొరేషన్ ఎండి డి.వాసుదేవ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు నిత్యం పనిచేస్తున్న విధంగానే నూతన సంవత్సరం సమయంలో ఈనెల 31న కూడా పనిచేస్తాయన్నారు.
 
రోజువారీ సమయాల్లోనే పనిచేస్తాయని.. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా ఈనెల 31న మద్యం దుకాణాలు,బార్ అండ్ రెస్టారెంట్ల వ్యాపార సమయాల్లో మార్పులు ఏమైనా ఉన్నాయాయని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి తన కార్యాలయానికి అనేక ఫోన్ కాల్స్ వస్తుండటంతో క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం దుకాణాలు ఉదయం 11గం.ల నుండి రాత్రి 9గం.ల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకూ పనిచేస్తాయన్నారు. 
 
ఈ నెల 31న కూడా అదే సమయాల్లో పనిచేస్తాయని.. ఈ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. నిజానికి కరోనా సెకండ్ వేవ్ ముప్పు ఉండటంతో ఈ నెల 31న, జనవరి 1న పూర్తి స్థాయి కర్ఫ్యూ విధించే అవకాశాలున్నాయని కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో క్లారిటీ వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్తరకం కరోనా స్ట్రెయిన్.. లక్షణాలివే