Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుంటూరు జిల్లా చిన్నారి మృత్యువాత.... ఎక్కడ?

గుంటూరు జిల్లా చిన్నారి మృత్యువాత.... ఎక్కడ?
, మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (14:12 IST)
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. పెంట్‌హౌస్ స్లాబ్ విరిగిపడిన ఘటనలో నాలుగేళ్ళ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని షారూన్ దీత్య (4)గా గుర్తించారు. కూకట్‌పల్లిలోని హెచ్ఎంటీ హిల్స్ శాతవాహన నగరవాసి. మృతురాలి తల్లిదండ్రులు సునీల్ కుమార్. లూత్ మేరీ. స్వస్థలం గుంటూరు జిల్లా మేడికొండూరు గ్రామవాసులు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరానికి వలస వెళ్లి బేకరీ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. 
 
ఈ క్రమంలో మంగళవారం ఉదయం టిఫిన్ తీసుకొచ్చేందుకు మేరీ తన కుమార్తెతో కలిసి పక్కనే ఉన్న టిఫిన్ సెంటరుకు వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తుండగా బేకరీ పక్కనే ఉన్న భవనంపై నిర్మాణంలో ఉన్న పెంట్‌హౌస్‌కు సెంట్రింగ్ కర్రలు తొలగిస్తుండా స్లాబ్ విరిగి తల్లీ బిడ్డపై పడ్డాయి. 
 
ఈ ఘటనపై చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మేరీ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు  చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూకట్‌పల్లిలో దారుణం.. వాటర్‌ ట్యాంక్‌ గోడ కూలి చిన్నారి?