Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన దళిత బాలికపై పోలీసు అత్యాచారం.. ఎక్కడ?

Advertiesment
victim
, బుధవారం, 27 సెప్టెంబరు 2023 (16:54 IST)
సమాజానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే కామాంధులుగా మారిపోతున్నారు. ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు వచ్చిన ఓ దళిత మహిళపై కామంతో కళ్ళుమూసుకునిపోయిన పోలీసు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ దళిత మహిళను కొందరు అకతాయిలు వేధింపులకు గురిచేస్తూ చంపేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో వారిపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చింది. ఆ సమయంలో ఠాణాలో ఉన్న ఎస్ఐ సుధీర్ కుమార్ పాండేకు తన బాధను వివరించింది. ఆ వెంటనే ఆయన నిందితులను అరెస్టు చేసేందుకు వెళదామని చెప్పి, బాధితురాలిని తన వాహనంలో ఎక్కించుకున్నాడు. అధికారి చెప్పిన మాటలు నమ్మిన అతనితోపాటు వెళ్లింది. దారిలో కారు ఆపి మత్తుమందు కలిపిన శీతలపానీయాన్ని ఆమెతో తాగించాడు. 
 
దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ స్పృహలోకి వచ్చిన బాధితురాలు తాను మోసపోయానని గ్రహించి సదరు పోలీసుపై ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు ఆ కామాంధ ఎస్‌ఐను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. పరారీలో ఉన్న ఎస్ఐ సుధీర్ కుమార్ పాండే కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు : నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్