Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యం తాగొచ్చి భార్యను చితక బాదిన భర్త.. కాల్చిపారేసిన భార్య... ఎక్కడ?

murder
, మంగళవారం, 13 జూన్ 2023 (08:51 IST)
భర్త హత్య కేసులో భార్యను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి విపరీతంగా మద్యం తాగి వచ్చి భార్యను చితకబాదాడు. దీంతో ఆగ్రహించిన భార్య.. ఇంట్లోని తుపాకీతో భర్త ఛాతిపై కాల్పులు జరిపడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత తన భర్త నాటు తుపాకీతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసి, ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తుంది. మృతుడు బీజేపీ నేత కాగా, ఈ ఘటన మీరట్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నిశాంత్ గార్గ్ అనే బీజేపీ నేత ఇటీవల హత్యకు గురయ్యాడు. ఆయన మృతదేహాన్ని పోలీసుల సోమవారం గుర్తించారు. మృతదేహంపై తుపాకీ గాయాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆయన భార్య సోనియాను పోలీసులు అరెస్టు చేశారు. సోనియాపై అనుమానాలు రావడంతోనే ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరచగా, జ్యూడీషియల్ కస్టడీకి విధించింది. 
 
అయితే, తన భర్త నాటు తుపాకీతో కాల్చుకున్నాడని తొలుత చెప్పిన సోనియా... తమ మధ్య జరిగిన కొట్టాటలో తుపాకీ ఒక రౌండ్ పేలి తన భర్త ఛాతిలోకి దూసుకెళ్లిందని చెప్పింది. ఆ తర్వాత మాట మార్చి.. శుక్రవారం రాత్రి విపరీతంగా మద్యం తాగివచ్చి తనను కొట్టాడని, అందుకే ఆయనను తుపాకీతో కాల్చిపారేసినట్టు చెప్పింది. విచారణలో ఒక అల్మారా నుంచి పిస్టల్‌తో పాటు గార్గ్ మొబైల్‌ను కూడా తీసుకొచ్చి ఇచ్చిందని తెలిపారు. మృతుడు గార్గ్ వెస్ట్ యూపీ బీజేపీ యువమోర్ఛా సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పది రూపాయలు అడిగిన కుమారుడు.. గొంతు నులిమి హత్య చేసిన తండ్రి.. ఎక్కడ?