Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యం తాగి వచ్చాడని మందలించిన తల్లి... నాలుక కోసిన కిరాతక కొడుకు

knife
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (16:17 IST)
మద్యం తాగివచ్చాడని మందలించినందుకు తల్లి మందలించింది. దీన్ని జీర్ణించుకోలేని కిరాతక తనయుడు ఆమెపై దాడి చేసి... ఆమె నాలుకను కోశాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా రామభద్రపురంలో చోటుచేసుకుంది. తాగిన మైకంలో తల్లిన దారుణంగా గొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె నాలుక కోసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళగా, ఆ నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. 
 
రామభద్రాపూరానికి చెందిన రవణమ్మకు శ్రీనివాస రావు అనే కుమారుడు ఉండగా, అతను పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో గురువారం పీకల వరకు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మద్యం తాగి తూలుతూ వచ్చిన కుమారుడిని చూసిన రవణమ్మ తీవ్రంగా మందలించింది. 
 
దీంతో కొద్దిసేపు తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహంహంతో శ్రీనివాస తన తల్లిపై దారుణంగా దాడి చేసి హతమార్చాడు. తల్లి కిరాతకంగా హత్య చేసిన ఆమె నాలుకను కోసి దానిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొత్తుపై ములాఖత్‌కు ముందే పవన్ నిర్ణయం ... ఇంత హఠాత్తుగానా అంటూ బాబు ప్రశ్న...