Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ధోనీకి కఠిన పరీక్షే : సునీల్ గవాస్కర్

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లో భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కఠిన పరీక్షేనని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న కివీస్ జట

Advertiesment
Sunil Gavaskar
, శనివారం, 15 అక్టోబరు 2016 (15:49 IST)
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లో భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కఠిన పరీక్షేనని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న కివీస్ జట్టు... ఆడిన మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఈ సిరీస్ తర్వాత ఆదివారం నుంచి వన్డే టోర్నీ ప్రారంభంకానుంది. భారత వన్డే జట్టుకు ధోనీకి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 
 
దీనిపై గవాస్కర్ స్పందిస్తూ కివీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌లో ధోనీకి కఠిన పరీక్ష ఎదురుకానుందన్నాడు. టెస్ట్ క్రికెట్‌కి గుడై‌బై చెప్పిన తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లను అతి తక్కువగా ధోనీ ఆడుతున్నాడని... దీంతో, తన పూర్వవైభవం చాటుకోవడానికి ధోనీ ఎంతో శ్రమించాల్సి ఉందన్నాడు. 
 
35 ఏళ్ల వయసులో ఉన్న ధోనీ నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఆశించడం కూడా అత్యాశే అవుతుందన్నాడు. ఏ అథ్లెట్ అయినా 30 ఏళ్లు దాటిన తర్వాత తిరిగి పుంజుకోవడం చాలా కష్టమవుతుందని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయంగా ఎన్నో ఘనతలు సాధించిన గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్ కూడా వయసు పైబడే కొద్దీ అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడని గుర్తు చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మియాందాద్‌ను విమర్శిస్తే లేపేస్తాం... అఫ్రిదికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ బెదిరింపు