Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగ్‌పూర్ వన్డేలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. భారత్ అద్భుత విజయం

Advertiesment
ind vs eng

ఠాగూర్

, గురువారం, 6 ఫిబ్రవరి 2025 (22:28 IST)
నాగ్‌పూర్ వన్డేలో పర్యాటక ఇంగ్లండ్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. భారత్ ఘన విజయం సాధించింది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో స్వాధీనం చేసుకున్న భారత్.. గురువారం జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. 249 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... నాలుగు వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. కేవలం 38.4 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. 
 
భారత ఆటగాళ్లలో వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ 96 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 87 పరుగులతో చెలరేగిపోయాడు. ఓ వైపు కండరాల నొప్పి వెంటాడుతున్నా.. అద్భుత పోరాటం చేశాడు. అక్షర్‌ పటేల్‌ 47 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 52, శ్రేయస్‌ అయ్యర్‌ 36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 59 అర్థశతకాలు సాధించారు. ఓపెనర్లు జైస్వాల్‌ (15), రోహిత్‌ శర్మ (2) నిరాశ పరిచారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆర్చర్‌, మహమూద్‌, బెతెల్‌, రషీద్‌ తలో వికెట్‌ తీశారు.
 
నాగ్‌పూర్ వన్డే మ్యాచ్ : రాణించిన బౌలర్లు - ఇంగ్లండ్ 248 ఆలౌట్
 
నాగ్‌పూర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం తొలి వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌‍లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లీష్ ఆటగాళ్లు పరుగులు సాధించడంలో తడబాటుకు గురయ్యారు. 
 
ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌ బట్లర్‌ 67 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేయగా, బెతెల్‌ 64 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 51 చొప్పున పరుగులు చేశారు. ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌ 26 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్‌ల సాయంతో 43 మెరుపు వేగంతో ఇన్నింగ్స్‌ ప్రారంభించినప్పటికీ.. సమన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. 
 
మరో ఓపెనర్‌ డకెట్‌ (32; 29 బంతుల్లో 6×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగతా వారెవరూ పెద్దగా రాణించలేదు. అరంగేట్ర బౌలర్‌ హర్షిత్‌ రాణా తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేశాడు. కీలకమైన 3 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. జడేజా మూడు వికెట్లు తీయగా అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ షమీ, కుల్‌దీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ తీశారు.
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత క్రికెట్ జట్టు 22.3 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్ జైశ్వాల్ 15, రోహిత్ శర్మ 2, శ్రేయాస్ అయ్యర్ 59 చొప్పున పరుగులు చేసి ఔట్ కాగా, గిల్ 42, అక్సర్ పటేల్ 25 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగ్‌పూర్ వన్డే మ్యాచ్ : రాణించిన బౌలర్లు - ఇంగ్లండ్ 248 ఆలౌట్