Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు షాక్... టెస్ట్ జట్టు హెడ్ కోచ్ రాం రాం

Advertiesment
Gillespie

ఠాగూర్

, శుక్రవారం, 13 డిశెంబరు 2024 (10:39 IST)
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో తేరుకోలేని షాక్ తగిలింది. టెస్ట్ జట్టు ప్రధాన కోచ్ జాసన్ గిలెస్పీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని క్రిక్ బజ్ వెల్లడించింది. మరికొన్ని గంటల్లో పాక్ జట్టు రెండు టెస్టుల సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉండగా ఆయన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఈ విషయం తెలియజేసినట్లు పేర్కొంది.
 
'గిలెస్పీ రాజీనామా చేశారు' అని పీసీబీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారని క్రిక్‌బజ్ పేర్కొంది. దీంతో వన్డే జట్టు తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావేద్‌ను టెస్టు జట్టుకు తాత్కాలికంగా పీసీబీ నియమించింది. "రెడ్ బాల్ హెడ్ కోచ్ జాసన్ గిల్లెస్పీ రాజీనామా తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆకిబ్ జావేద్‌ను తాత్కాలిక రెడ్ బాల్ హెడ్ కోచ్ నియమించింది" అని పీసీబీ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
 
కాగా, అసిస్టెంట్ కోచ్ టిమ్ నీల్సన్ కాంట్రాక్టును పునరుద్దరించడానికి పీసీబీ నిరాకరించడంతోనే గిలెస్పీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు గిలెస్పీ, నీల్సన్ ఇద్దరూ మంచి అవగాహనతో జట్టుకు కోచింగ్ బాధ్యతలు నిర్వహించారు.
 
ఇక గ్యారీ కిర్‌స్టన్ రాజీనామా తర్వాత ఆకిబ్ జావేద్ ఇంతకుముందు వైట్ బాల్ జట్టుకు తాత్కాలిక ప్రధాన కోచ్ నియమితుడైన విషయం తెలిసిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో మూడు టీ20లు, మూడు వన్డేల కోసం పాక్ వైట్ బాల్ జట్టుతో ఉన్నాడు.
 
కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్‌లో తొలి టెస్టు జరగనుంది. రెండో టెస్టు జనవరి 3 నుంచి 7 వరకు కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

How much prize money India’s D Gukesh గుకేశ్‌ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?