Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హెచ్.సి.ఏలో నిధుల గోల్‌మాల్.. విచారణకు హాజరైన అజారుద్దీన్

Advertiesment
azaruddin
గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ)లో నిధుల గోల్‌మాల్ అంశంపై ఆయనపై మనీ లాండరింగ్ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. హెచ్.సి.ఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ మంగళవారం విచారణకు హాజరయ్యారు. 
 
హెచ్‌సీఏలో జరిగిన అవకతవకల వ్యవహారంలో ఇటీవల ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయంతెల్సిందే. దీంతో మంగళవారం హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా అజహర్‌ మాట్లాడుతూ తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని చెప్పారు.
 
హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియానికి సంబంధించి జనరేటర్లు, అగ్నిమాపక వాహనాలు, ఇతర సామగ్రి కొనుగోళ్లకు సంబంధించి రూ.20 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అజహర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు బరోడాతో ఎంతో అనుభవం ఉంది : సచిన్ టెండూల్కర్