Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

18 ఏళ్ల పైబ‌డిన వారంద‌రికీ వ్యాక్సిన్, భువనేశ్వర్ టాప్!

18 ఏళ్ల పైబ‌డిన వారంద‌రికీ వ్యాక్సిన్, భువనేశ్వర్ టాప్!
, మంగళవారం, 3 ఆగస్టు 2021 (16:03 IST)
దేశంలో ఎక్క‌డ చూసినా... వ్యాక్సినేష‌న్ కోలాహ‌లం... టీకాలు వేయించుకోండ‌ని హోరున డ‌ప్పు వాయించి మ‌రీ చెపుతున్న ప్ర‌భుత్వాలు... నిత్యం వ్యాక్సినేష‌న్ కోసం ఆరోగ్య కేంద్రాల వ‌ద్ద క్యూలు, వాక్సిన్... 45 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారికే అంటూ... నియ‌మాలు నిబంధ‌న‌లు... ఎక్క‌డ చూసినా ప్ర‌చార హంగామానే... 
 
కానీ, ఆయ‌న మాత్రం చాలా సైలెంట్ గా త‌న ప‌ని తాను చేసుకుపోయారు. ఎక్క‌డా డప్పు కొట్టింది లేదు .. హంగామా లేదు...సైలెంట్ కిల్లర్... తన తాను చేసుకుని వెళ్ళిపోతారు. దేశరాజకియాల్లోనే ఇపుడు ఆయ‌న సంచలనం అయ్యారు. ప్రతిపక్ష పార్టీల వారు కూడా మెచ్చుకునే పాలన ఆయన సొంతం...  ఆయనే ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. 
 
ఒడిసా రాజధాని భువనేశ్వర్‌లో 18ఏళ్లు పైబడిన, అర్హులైన వారందరికీ 100% వ్యాక్సిన్లు పూర్తి చేసి రికార్డ్ సృష్టించారు. వ‌యో వృద్ధులు మొద‌లుకొని, 18 ఏళ్ళ పైబ‌డిన వారంద‌రికీ వ్యాక్సినేష‌న్ యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేసేశారు. అక్క‌డితో ఆగ‌లేదు... భువ‌నేశ్వ‌ర్ కు వ‌చ్చిన వలస కూలీలు, తాత్కాలిక నివాసం ఉండేవారు.. చివ‌రికి చుట్టుం చూపుగా వ‌చ్చిన‌ వీరికి కూడా వ్యాక్సిన్ వేసేసారు. ఎలాంటి ప్ర‌చార పటోటోపం లేకుండా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ న‌డిపిన సైలెంట్ వ్యాక్సిన్ డ్రైవ్ ఇపుడు దేశాన్నే అబ్బుర‌ప‌రుస్తోంది. అంద‌రూ శ‌భాష్ నోబీన్ అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంచెలో దూరిన పాము, ఏం చేశాడంటే?