Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

కర్నూలులో కలకలం : 11 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్

Advertiesment
Kurnool
, మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (14:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగం ఏమాత్రం తగ్గడం లేదు. పైగా, పలు జిల్లాలు కరోనా హాట్ స్పాట్ జిల్లుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో 11 నెలల చిన్నారికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ చిన్నారిని సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచారు. కానీ, ఈ చిన్నారి కుటుంబ సభ్యులకు జరిపిన పరీక్షల్లో వారందరికీ నెగెటివ్ వచ్చింది. ఈ ఘటన కర్నూలు జిల్లా అప్సరి మండలం జోహరాపురం గ్రామంలో జరిగింది. 
 
ఈ చిన్నారి గత కొన్ని రోజలుగా కరోనా లక్షణాలతో బాధపడుతూ వచ్చింది. దీంతో సోమవారం ఆ చిన్నారితో పాటు కుటుంబ సభ్యులంతా కోవిడ్ ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 11 నెలల చిన్నారికి మాత్రం పాజిటివ్ అని రాగా, మిగిలిన వారికి మాత్రం నెగెటివ్ అని వచ్చింది. 
 
ఏపీలో మరో 82 కొత్త కేసులు 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కరోనా పడక విసిరింది. దీంతో గత 24 గంటల్లో కొత్తగా మరో 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 1259కి చేరింది. 
 
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 5,783 శాంపిళ్ళను సేకరించి పరీక్షించగా 82 మందికి కోవిడ్ 19 సోకినట్టు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1,259 పాజిటివ్ కేసులకు గాను 258 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారని వివరించింది.
 
ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 970గా ఉందని తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 1, చిత్తూరులో 1, గుంటూరులో 17, కడపలో 7, కృష్ణాలో 13, కర్నూలులో 40, నెల్లూరులో 3 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 
 
ఇకపోతే, జిల్లాల వారీగా పాజిటివ్ కేసులను పరిశీలిస్తే, అనంతపురం 54, ఈస్ట్ గోదావరి 74, గుంటూరు 39, గుంటూరు 254, కడప 65, కృష్ణ 223, కర్నూలు 332, నెల్లూరు 82, ప్రకాశం 56, శ్రీకాకుళం 4, విశాఖపట్టణం 22, వైస్ట్ గోదావరి 54 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'తమ్ముడు'కే 'అన్నయ్య' మద్దతు - తేల్చి చెప్పిన మెగాస్టార్