Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ముగ్గురు మృతి

Advertiesment
Coronavirus
, మంగళవారం, 8 డిశెంబరు 2020 (11:44 IST)
తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో కొత్తగా 682 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. మరో 812 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం (డిసెంబర్ 8) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.
 
తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,74,540కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1477కి చేరింది. ప్రస్తుతం 7,696 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరో 5634 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 761 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,65,317కి చేరింది.
 
గడిచిన 24గంటల్లో మొత్తం 45,021 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 58,68,233కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,57,663 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 94.6శాతం ఉండగా తెలంగాణలో 96.65శాతం ఉన్నట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. ఇన్‌-యాప్‌ నోటిఫికేషన్ పేరుతో...?