Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2న కరోనా టీకా డ్రై రన్‌ : ఎంపిక చేసిన రాష్ట్రాల్లోనే...

Advertiesment
Covid 19
, శుక్రవారం, 1 జనవరి 2021 (17:26 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. అయితే, ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఫార్మా కంపెనీలు టీకాలను తయారు చేశాయి. వీటిలో కొన్నింటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. ఈ టీకాలను అత్యవసర వినియోగం కింద భారత్‌లో కూడా పంపిణీ చేయనున్నారు. 
 
ఇందులోభాగంగా, వ్యాక్సిన్ పంపిణీ కోసం ముందస్తు ఏర్పాట్లకు కేంద్రం చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా శనివారం డ్రై రన్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 
 
కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి అధ్యక్షతన గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు డ్రై రన్‌ విధివిధానాలపై చర్చించారు.
 
ప్రతి రాష్ట్రంలోని రాజధానిలో కనిష్ఠంగా ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో డ్రై రన్‌ నిర్వహిస్తారు. వైరస్‌ తీవ్రత ఎక్కువ, రవాణా సౌకర్యం తక్కువగా ఉన్న పలు జిల్లాల్లోనూ డ్రైరన్‌ నిర్వహించనున్నారు. 
 
మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో రాజధానుల్లోకాకుండా ఇతర ప్రధాన నగరాల్లో డ్రై రన్ నిర్వహించే అవకాశం ఉంది. అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే గత నెల 28, 29న తొలి విడుత డ్రై రన్‌ కొనసాగిన విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్యాపేటలో ఒకే ఫ్యామిలీలో 22 మందికి కరోనా పాజిటివ్