Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జెఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం పియర్సన్ సమగ్ర టెస్ట్ ప్రిపరేషన్ సిరీస్‌ విడుదల

Pearson

ఐవీఆర్

, మంగళవారం, 13 ఆగస్టు 2024 (23:04 IST)
ప్రపంచపు జీవితకాల అభ్యాస సంస్థ, పియర్సన్ , తమ కొత్త జెఈఈ అడ్వాన్స్‌డ్ పిసిఎం (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) సిరీస్‌ను విడుదల చేసింది, ఇది పోటీతత్వ జెఈఈ మెయిన్, జెఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం అత్యంత జాగ్రత్తగా రూపొందించిన వనరు. ప్రతి సంవత్సరం, 12 లక్షల మంది జెఈఈ మెయిన్స్, 2.5 లక్షల మంది అభ్యర్థులు జెఈఈ అడ్వాన్స్‌డ్‌లను ప్రయత్నిస్తారని అంచనా. ఈ సమగ్ర పుస్తక శ్రేణితో, 11వ, 12వ, 13వ తరగతులు(రిపీటర్)కు చెందిన విద్యార్థులు, ఈ పోటీ పరీక్షలలో ప్రయత్నించి విజయం సాధించాలని కోరుకుంటున్న  ఔత్సాహికులకు సహాయం చేయాలని పియర్సన్ లక్ష్యంగా పెట్టుకుంది. రాజస్థాన్‌లోని కోటలో జరిగిన అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యా రంగంలోని ప్రముఖులు, పియర్సన్ జెఈఈ అడ్వాన్స్‌డ్ పిసిఎం సిరీస్ రచయితలు ఓం శర్మ, అనన్య గంగూలీ, రాహుల్ సర్దానా పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా, పియర్సన్ ఇండియా కంట్రీ హెడ్ వినయ్ స్వామి మాట్లాడుతూ, “ప్రపంచంలో మేధావులైన ఇంజనీరింగ్‌లకు భారతదేశం గ్లోబల్ హబ్‌గా కొనసాగుతోంది. జెఈఈ ఇందులో అత్యంత విశ్వసనీయమైన, న్యాయమైన ప్రవేశ పరీక్షలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ఏళ్ల తరబడి కృషి, క్రమశిక్షణ, అంకితభావం, ప్రిపరేషన్ అవసరం. మా కొత్త జెఈఈ పిసిఎం అడ్వాన్స్‌డ్ సిరీస్‌ను కోటాకు చెందిన అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకులు రూపొందించారు, ఇది ఔత్సాహికులకు సమగ్రమైన, సరళమైన, సమర్థవంతమైన ప్రిపరేషన్ మార్గాలను అందిస్తుంది" అని అన్నారు. 
 
ఈ 18-భాగాల పుస్తక శ్రేణిలో లోతైన సిద్ధాంతం, అనేక ఉదాహరణలు, టాపిక్-ఆధారిత అభ్యాస పరీక్షలు, వ్యాయామాలు ఉన్నాయి. ఒలింపియాడ్‌లతో సహా జెఈఈ యొక్క అధునాతన, ప్రధాన స్థాయిలు రెండింటికీ అవసరమైన ప్రాథమిక సూత్రాలు, సాంకేతిక పరిజ్ఞానంలో బలమైన పునాదిని నిర్మించుకోవడానికి ఇది ఔత్సాహికులకు సహాయపడుతుంది. ఈ సిరీస్‌ను కోట నుండి ప్రశంసలు పొందిన, గౌరవనీయులైన రచయితలు - అనన్య గంగూలీ (కెమిస్ట్రీ టీచర్- మెంటర్), ఓం శర్మ (మాజీ-పరిశోధన, బార్క్) రాహుల్ సర్దానా (ఫిజిక్స్ ఇన్‌స్ట్రక్టర్ మరియు మెంటర్)- రచించారు. 
 
18 ప్రింట్ పుస్తకాలతో కూడిన పియర్సన్ జెఈఈ పిసిఎం పుస్తక శ్రేణిలో భౌతిక శాస్త్రంపై 7 పుస్తకాలు, రసాయన శాస్త్రంపై 6 పుస్తకాలు, గణితంపై 5 పుస్తకాలు ఉన్నాయి, భారతదేశంలోని అన్ని ప్రముఖ దుకాణాలు మరియు అమెజాన్ వంటి ప్రధాన ఇ-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌లలో అందుబాటులో ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేనేతకు వైభవం, సంప్రదాయంతో సమకాలీన సమ్మేళనం, తనైరా లైవ్ లూమ్ అనుభవపూర్వక కార్యక్రమం