Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి, చిత్తూరులో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన సోచ్‌

ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి, చిత్తూరులో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన సోచ్‌
, మంగళవారం, 11 జనవరి 2022 (23:40 IST)
భారతదేశం ఎక్కువగా అభిమానించే మహిళల ఎథ్నిక్‌ వేర్‌ బ్రాండ్‌, సోచ్‌ తమ సరికొత్త స్టోర్‌ను తిరుపతిలో ప్రారంభించింది. సోచ్‌కు తిరుపతిలో ఇది మొదటి స్టోర్‌.

 
ఈ స్టోర్‌ 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. సోచ్‌ యొక్క తాజా కలెక్షన్స్‌ దీనిలో ప్రదర్శిస్తారు. ఈ నూతన స్టోర్‌ ఎయిర్‌ బైపాస్‌ రోడ్‌,  న్యూ బాలాజీ కాలనీ వద్ద ఉంది. ఈ స్టోర్‌లో ప్రదర్శించే నూతన కలెక్షన్‌లో అత్యద్భుతమైన పింక్స్‌, రిఫ్రెషింగ్‌ ఎల్లోస్‌, డీప్‌ వైన్స్‌, బ్లూ, ఆహ్లాదకరమైన మస్టర్డ్స్‌, ఆకర్షణీయమైన బ్లాక్స్‌తో పాటుగా నూతన జోడింపు అయిన నియాన్స్‌ కూడా ఉంటాయి.

 
సోచ్‌ ఇప్పటికే ఏపీలో ఆరు నగరాలలో తమ ఉనికిని చాటుతుంది. స్థానిక మార్కెట్లు మరియు ధోరణులను అర్థం చేసుకుని వీటిని ఏర్పాటుచేయడం జరిగింది. ఈ స్టోర్‌ ప్రారంభం సందర్భంగా వినయ్‌ చట్లానీ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈవొ–సోచ్‌ అప్పెరల్స్‌ మాట్లాడుతూ, ‘‘మహోన్నతమైన ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మా స్టోర్‌ను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము.

 
ఆంధ్రప్రదేశ్‌లో మా బ్రాండ్‌ పట్ల అపూర్వమైన ప్రేమను వ్యక్తీకరిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మేము విస్తృతస్ధాయిలో ఉనికిని చాటుతున్నాము. ఈ ప్రాంతంలోని మా వినియోగదారులకు మా నూతన కలెక్షన్‌ మొదలు అపారమైన అవకాశాలను సైతం అందించనున్నాం. అత్యద్భుతమైన ఎథ్నిక్‌ వేర్‌ను సహేతుకమైన ధరలలో ఇక్కడ అందించే ఏర్పాట్లు చేశాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో ప్రతి సెకనుకు 9 కరోనా పాజిటివ్ కేసులు