Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీల బాదుడు?

Advertiesment
Government Weighs Charges On UPI Payments

ఠాగూర్

, బుధవారం, 11 జూన్ 2025 (14:47 IST)
బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు అందిస్తున్న సేవలకు ప్రయోజనం చేకూర్చేలా రూ.3 వేలు దాటిన లావాదేవీలపై చార్జీలను వసూలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. కిరాణా దుకాణంలో చిన్న వస్తువులను కొనుగోలు మొదలు ఇంటర్నేషనల్ బ్రాండ్ షాపుల్లో కొనుగోలు వరకు డిజిటల్ లావాదేవీలను వినియోగిస్తున్నారు. అయితే, త్వరలోనే ఈ లావాదేవీలపైనా మర్చంట్ చార్జీలను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ విషయాన్ని ఎన్.డి.టి.వి.ప్రాఫిట్ తన కథనంలో పేర్కొంది. 
 
అధిక విలువైన డిజిటల్ లావాదేవీలను నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో వీటికి సహకరించే లక్ష్యంతో ఎండీఆర్ చార్జీలను విధించాలని కేంద్రం భావిస్తోంది. వ్యాపారుల వార్షిక ఆదాయం ఆధారంగా కాకుండా లావాదేవీల విలువ ఆధారంగా ఈ ఎండీఆర్ చార్జీలను విధించేందుకు చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. యూపీఏ ద్వారా రూ.3 వేలకు పైబడిన లావాదేవీలపై ఈ చార్జీలు విధించే యోచనలో కేంద్రం ఉంది. అంటే 2020 జనవరి నుంచి అమల్లో ఉన్న జీరో ఎండీఆర్ పాలసీకి మున్ముందు స్వస్తి పలకలనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్ఎంపీ ఇంటి తాళం పగులకొట్టి బంగారం కొట్టేశాడు.. దొంగ ఎవరంటే?