Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి బంగారం ధరలు.. ఏడాది చివరికల్లా రూ.1.25 లక్షలకు..?

Advertiesment
gold

సెల్వి

, బుధవారం, 16 ఏప్రియల్ 2025 (19:03 IST)
బంగారం ధరలు సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.98,000 దాటింది. ఢిల్లీలో బంగారం ధరలు ఒకే రోజులో రూ.1,650 పెరిగి రూ.98,100కి చేరుకున్నాయి. సాయంత్రం 4:30 గంటలకు, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.97,700 కు చేరుకుంది.
 
వెండి ధరలు కూడా గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఒక కిలో వెండి ధర రూ.1,900 పెరిగి రూ.99,400కి చేరుకుంది. మంగళవారం వెండి కిలోకు రూ.97,500 వద్ద ముగిసింది.
 
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $3,318కి పెరిగింది. గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాల ప్రకారం, ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధరలు రూ.1.25 లక్షలకు పెరగవచ్చు. వాణిజ్య యుద్ధం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)