Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సౌర శక్తితో కూడిన గ్రీన్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన కియా

Kia
, బుధవారం, 27 సెప్టెంబరు 2023 (22:51 IST)
ప్రముఖ మాస్ ప్రీమియం కార్ల తయారీ సంస్థ కియా ఇండియా, హర్యానాలోని రోహ్‌తక్‌లో కియా యొక్క మొదటి గ్రీన్ వర్క్‌షాప్‌ను ప్రారంభించింది. తద్వారా భారతదేశంలో స్థిరమైన మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా మారాలనే దాని లక్ష్యం దిశగా మరో ముందడుగు వేసింది. ఇది పూర్తిగా సౌర శక్తిని వినియోగించుకుంటుంది. EV AC ఛార్జింగ్ యూనిట్‌కు శక్తినిచ్చే సమయంలో 80% కంటే ఎక్కువ శక్తి అవసరాలను తీర్చడంలో ఇది  సహాయపడుతుంది.
 
కియా ఈ వర్క్‌షాప్‌లో సర్వీసింగ్ ప్రక్రియలో ఉపయోగించిన నీటిని 100% రీసైక్లింగ్ చేయడంతో పాటుగా భూగర్భజల స్థాయిని పెంచటానికి వర్షపు నీటి సేకరణ ప్రక్రియను కూడా నిర్వహిస్తుంది. ఈ వర్క్‌షాప్ స్టీమ్ వాష్ టెక్నాలజీని పరిచయం చేయడంతో కార్ వాషింగ్ ప్రక్రియను మెరుగుపరచటంతో పాటుగా సాంప్రదాయ కార్ వాష్‌తో పోలిస్తే 95% నీటి వినియోగాన్ని ఆదా చేస్తుంది. కియా ఇండియా 2026 నాటికి మరో 150 గ్రీన్ వర్క్‌షాప్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా చేసుకుంది. ఈ సౌకర్యాలు మెట్రో నగరాలతో పాటు టైర్ 3 మరియు 4 మార్కెట్‌లను కూడా కవర్ చేస్తాయి. 
 
వర్క్‌షాప్‌ను ప్రారంభిస్తూ, కియా ఇండియా చీఫ్ సేల్స్ అండ్ బిజినెస్ స్ట్రాటజీ ఆఫీసర్ శ్రీ మ్యుంగ్-సిక్ సోహ్న్ మాట్లాడుతూ, "రోహ్‌తక్‌లో మా మొదటి గ్రీన్ వర్క్‌షాప్ ప్రారంభించడం అనేది స్థిరమైన మొబిలిటీ పరంగా కియా ఇండియాను అగ్రగామిగా మార్చాలనే దిశగా ఒక ముందడుగుగా నిలుస్తుంది.  ఈ ఆవిష్కరణలతో, మేము మా కార్బన్ పాదముద్రను తగ్గించడమే కాకుండా పరిశ్రమకు నాయకత్వం వహిస్తున్నాము" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను ఎలాంటిదాన్నో నా భర్త నమ్మితే చాలు.. నారా భువనేశ్వరి ఉద్వేగం