Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

Advertiesment
Hibiscus

సెల్వి

, గురువారం, 6 మార్చి 2025 (09:26 IST)
సాధారణంగా ప్రతి మహిళ తన ముఖం చాలా అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీనికోసం తరచుగా బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. ఇంకా మరికొందరు ఖరీదైన క్రీములను కొని ముఖాలకు రాసుకుంటారు. 
 
అయితే వీటితో డబ్బు వృధా. మెరిసే అందం కోసం మందార పువ్వుతో పొందవచ్చు. ఎలాగో చూద్దాం.. మందార పువ్వు, దాని ఆకులను సాధారణంగా జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా మార్చడానికి ఉపయోగిస్తారు. ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి మందార పువ్వులను ఉపయోగించవచ్చు. 
 
మందార పువ్వులతో తయారు చేసిన ఈ ఫేస్ ప్యాక్ కేవలం ఒక వారంలోనే ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. తాజాగా కోసిన 10 మందార పువ్వులను తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో అర లీటరు నీరు పోసి మరిగించాలి. నీరు వేడెక్కిన తర్వాత, దానికి మందార పువ్వును వేయాలి. 
 
మందార పువ్వు జెల్ రూపం మారిన తర్వాత.. ఆ జెల్‌తో సున్నితంగా మసాజ్ చేయండి. ముఖానికి మాత్రమే కాకుండా, మీ చేతులు, కాళ్ళు, మెడకు కూడా అప్లై చేయవచ్చు. 
 
20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖంలోని మురికి, మచ్చలు, నల్లటి మచ్చలు తొలగిపోయి, ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. స్నానానికి ముందు ఏడు రోజులు ఇలా చేస్తే, ముఖం ఏడు రోజుల్లో కాంతివంతంగా మారుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?