Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పళ్లు పసుపుపచ్చగా ఉన్నవారు ఈ చిట్కాలు పాటిస్తే?

కాఫీ, టీ, కోలాలు ఎక్కువగా తాగడం వలన పళ్లు పసుప్పచ్చగా మారుతాయి. ఆ సమస్యను పొగొట్టేందుకు కొన్ని చిట్కాలు. ఈ చిట్కాలు పాటిస్తే ముత్యాల్లాంటి పలువరుసను మీ సొంతం చేసుకోవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.

Advertiesment
పళ్లు పసుపుపచ్చగా ఉన్నవారు ఈ చిట్కాలు పాటిస్తే?
, శనివారం, 7 జులై 2018 (12:22 IST)
కాఫీ, టీ, కోలాలు ఎక్కువగా తాగడం వలన పళ్లు పసుప్పచ్చగా మారుతాయి. ఆ సమస్యను పొగొట్టేందుకు కొన్ని చిట్కాలు. ఈ చిట్కాలు పాటిస్తే ముత్యాల్లాంటి పలువరుసను మీ సొంతం చేసుకోవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
 
క్యారెట్, యాపిల్, కొత్తిమీర, కూరగాయలు, పండ్లను తరచూ ఆహారంతో పాటు తీసుకోవాలి. ఇవన్నీ పళ్లపై ఉండే ఎనామిల్‌కు హాని కలిగించకుండా సహాయపడుతాయి. పాలు, పాల పదార్థాలు తీసుకోవడం వలన నోటిలోని పీహెచ్ స్థాయిలు పెరిగి ఎనామిల్ పోకుండా ఉంటుంది. అరటిపండు, కమలాపండు తొక్క లోపలి భాగాలతో పళ్లపై మృదువుగా రుద్దుకుంటే పసుపుదనం తొలగిపోతుంది.
 
ఈ పండ్ల తొక్కల్లో ఉండే ఖనిజాలు మెగ్నిషియం, పొటాషియం, మాంగనీస్ ఎనామిల్‌కు రక్షణగా ఉంటాయి. పరిశుభ్రమైన చెంచా కొబ్బరినూనెను తీసుకుని 15 నిమిషాల పాటు పుక్కిలించాలి. ఈ నూనె నోట్లోని అన్ని భాగాలను తాకేల పుక్కిలించాలి. ఆ తరువాత నూనె ఉమ్మేసి నోరు శుభ్రం చేసుకొనిన వెంటనే రెండు గ్లాసుల నీరు త్రాగాలి. 
 
కొబ్బరినూనెలోని లారిక్ ఆమ్లం దంతాలపై పసుపుదనానికి కారణమయ్యే బ్యాక్టీరియాలను నశింపజేస్తుంది. టూత్‌పేస్ట్‌లో కాస్త ఉప్పును కలుపుకుని పళ్లను  తోముకుంటే దంతాలలో గల పసుపుదనం తొలగిపోయి వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలా కాకుంటే వంటసోడాను కూడా టూత్‌పేస్ట్‌లో వేసుకుని తోముకుంటే మంచి మార్పు కనిపిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళల్లో అతి దాహం.. అతి ఆకలి దేనికి కారణమంటే?