Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పురుషుడితో మేమూ సమానం.. ఓ పెగ్గు వేయాల్సిందే : మహిళల మనోగతం

సమాజంలో పురుషుడితో మేమూ సమానమే. వారితో పాటు మేమూ ఆర్థికంగా స్థిరపడుతున్నాం. వారిలానే మేమూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం. అలాంటపుడు మేము కూడా ఓ పెగ్గు వేయాల్సిందేనంటూ దేశంలోని మగువలు తెగేసి చెపుతున్నారు.

పురుషుడితో మేమూ సమానం.. ఓ పెగ్గు వేయాల్సిందే : మహిళల మనోగతం
, బుధవారం, 26 అక్టోబరు 2016 (08:31 IST)
సమాజంలో పురుషుడితో మేమూ సమానమే. వారితో పాటు మేమూ ఆర్థికంగా స్థిరపడుతున్నాం. వారిలానే మేమూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం. అలాంటపుడు మేము కూడా ఓ పెగ్గు వేయాల్సిందేనంటూ దేశంలోని మగువలు తెగేసి చెపుతున్నారు. ముఖ్యంగా.. నగరాల్లో నివశించే మహిళలు.. యేడాదిలో ఒక్కసారైనా మద్యం రుచి చూస్తున్నారట. ఇలా రుచి చూస్తున్న వారు ఐదు శాతం ఉండగా, వీరి వల్ల ఏటా 30 శాతం అమ్మకాలు పెరుగుతున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. 
 
నిజానికి మద్యపానం.. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. క్యాన్సర్‌ కారకం. ఎక్కడ చూసినా మనకు కనిపించే ప్రకటన ఇది. ఇలా అవగాహన పెంచడం వల్ల ఎక్కువ మంది ఈ అలవాట్లకు దూరమవుతారని ప్రభుత్వం ఆశ. కానీ జరుగుతోంది వేరు. ఇప్పటి వరకూ మద్యపానం పురుషులకే పరిమితం అన్నట్టుండేది. క్రమంగా ఈ ధోరణి మారుతోంది. మహిళల్లోనూ మద్యపానం పెరుగుతోంది. గత కొన్ని దశాబ్దాలతో పోల్చితే.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహిళలు దాదాపు పురుషులతో సమానంగా మద్యం తాగుతున్నారట.
 
ఇదే విషయంపై ఆస్ట్రేలియాలని న్యూ సౌత్‌వేల్స్‌ విశ్వవిద్యాలయం ఐదేళ్ళపాటు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధన మేరకు ఒకప్పుడు మద్యపానం విషయంలో పురుషులు, మహిళల మధ్య తేడా 12 రెట్లుగా ఉండగా, ఇపుడది బాగా తగ్గిపోయింది. పాశ్చాత్య దేశాలతో పోల్చితే మన దేశంలో మద్యం తాగే మహిళలు చాలా తక్కువ. కానీ నగరాల్లో క్రమంగా పెరుగుతున్నారు. అమెరికాలో 60 శాతం మంది మహిళలు ఏడాదిలో ఒక్కసారైనా మద్యం రుచి చూస్తుండగా ఈ రేటు భారత నగరాల్లో 5 శాతంగా ఉన్నట్లు అంచనా వేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలా చేయకపోతే ఆరోగ్యాన్ని చేజేతులా దుప్పట్లో కప్పి పెడుతున్న‌ట్లే లెక్క...