Publish Date: Wed, 07 Jan 2015 (16:49 IST)
Updated Date: Wed, 07 Jan 2015 (16:52 IST)
ఆటలు ఆడే వాళ్లు ఆరోగ్యంగా ఉంటారనేది అందరికీ తెలిసిందే. కానీ ఆటలు ఆడే వారు ఆటల్లో ముందుంటారని ముఖ్యంగా మహిళల్లో ఈ తీరు ఎక్కువగా కనబడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్న సిబ్బందిలో అధిక శాతం ఏదో ఒక దశలో అథ్లెట్గా ఉన్నవారేనని అధ్యయనంలో వెల్లడైంది. సీఈవో, సీఎఫ్లో, సీవోవో స్థాయిలో ఉన్నవారిలో 52 శాతం ఏదో ఒక ఆటతో పరిచయం ఉన్నవాళ్లేనని తేలింది.
ఆటల్లో రాణించిన వారు వ్యాపార ప్రపంచంలో విజేతలుగా రాణిస్తున్నారు. ఏ ఆటైనా క్రమశిక్షణను నేర్పిస్తుంది. సమయం విలువ చెబుతుంది. అదే క్రమ శిక్షణా, సమయపాలనా వ్యాపార నిర్వహణలో బాగా ఉపయోగపడతాయి. నలుగురిలో చొరవగా కలిసిపోవడం, చురుగ్గా నిర్ణయాలు తీసుకోవడం కూడా అలవడతాయి. కెరీర్లో పైకి ఎదగడానికి, వ్యాపార వేత్తలుగా రాణించడానికీ ఈ లక్షణాలు దోహదం చేస్తాయి.