Publish Date: Thu, 22 Nov 2007 (16:52 IST)
Updated Date: Thu, 22 Nov 2007 (16:17 IST)
సేమ్యా - పావు కిలో
శనగపిండి - అర కిలో
మిరపకాయ ముక్కలు - 2 స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు - 2 కప్పులు
వీటికి సరిపడే కారం.. ఉప్పు. నూనె తీసుకువాలి..
తయారీ: నీటిలో ఉడికించిన సేమ్యాను కాటన్ గుడ్డపై బాగా ఆరబెట్టిన తర్వాత, దాన్ని ఒక బేసిన్లోకి తీసుకుని శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయ ముక్కలు, సరిపడ కారం, ఉప్పు, నీరు కలిపి పిండిలా కలుపుకోవాలి.
తర్వాత బాణలిలో నూనెను కాగించి అందులో మనం అంతకుముందు కలుపుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేయాలి. అది వేగిన తర్వాత ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం వేడి వేడి పకోడీని కారం కారంగా నములుతుంటే ఉంటుంది...