Publish Date: Mon, 20 Aug 2007 (13:51 IST)
Updated Date: Mon, 20 Aug 2007 (13:50 IST)
కావలసిన పదార్థాలు:
ఉల్లి, క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్ తురుములు: చెరో అరకప్పు
పచ్చిమిర్చి ముక్కలు: అర కప్పు
ఎండుమిర్చి పేస్ట్: అర టీస్పూన్
మైదాపిండి: ఒకకప్పు
కార్న్ఫోర్ల్: 11/4 కప్
ఉప్పు: తగినంత
వెల్లుల్లి రెబ్బలు: మూడు
ఇలా చేయండి:
మైదాపిండి, కార్న్ఫోర్ల్లో కొద్దిగా నీటిని పోసి అందులో వెజిటబుల్ తురుములను చేర్చండి. ఉప్పు ఎండుమిర్చి పేస్ట్ను కలిపి పకోడీల పిండిలా చేసుకుని చిన్న చిన్న పకోడీల మాదిరిగా నూనెలో దోరగా వేయించి దించేయండి. ఈ పకోడీలను గ్రీన్ చట్నీతో సర్వ్చేస్తే రుచికరంగా ఉంటుంది.