Publish Date: Tue, 15 Jul 2008 (19:13 IST)
Updated Date: Tue, 15 Jul 2008 (19:12 IST)
కావలసిన పదార్థాలు :
పెరుగు... ఒక కప్పు
అల్లం... చిన్నముక్క
పచ్చిమిరపకాయలు... రెండు కాయలు
కీరదోసకాయ... రెండు కాయలు
కొత్తిమీర... రెండు రెమ్మలు
కరివేపాకు.... రెండు రెమ్మలు
నూనె... ఒక టీస్పూన్
ఆవాలు... ఒక టీస్పూన్
మినపప్పు... ఒక టీస్పూన్
ఉప్పు... సరిపడా
తయారీ విధానం :
అల్లం, పచ్చి మిరపకాయలను ముందుగా నూరిపెట్టుకోవాలి. కీరదోసకాయను కూడా తురిమిపెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకులను పెరుగులో వేసి తగినంత ఉప్పు చేర్చి కలుపుకోవాలి. దీనికి తురిమిన కీరదోస చేర్చి, ఆవాలు, మినపప్పును నూనెలో పోపు వేసి పెరుగు మిశ్రమంలో కలిపితే.... పసందైన పెరుగుపచ్చడి సిద్ధమైనట్టే.