కావలసిన పదార్థాలు:
కందిపప్పు: రెండు టేబుల్ స్పూన్లు
పసుపు: కాస్త
మిరియాలు, జీలకర్ర: ఒక టేబుల్ స్పూన్
ఆవాలు: ఒక టేబుల్ స్పూన్
ధనియాలు: 1/4 టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు: నాలుగు
టమోటా: నాలుగు
ఉప్పు: తగినంత
చింతపండు రసం: రెండు గ్లాసులు
కొత్తిమీర, కరివేపాకు తరుగులు: కాస్త
తయారీ విధానం:
చింతపండు రసంలో ఉడికించిన కందిపప్పు. మిరియాలు, జీలకర్ర, ధనియాలు, పసుపు పొడులను కలిపి ఒక గ్లాస్ నీరు పోయండి. ఇందులో టమోటా, ఉప్పు ఇంగువ పొడిని కూడా కలిపి కాసేపు మరిగించి దించేయండి. దించాక కొత్తిమీర, కరివేపాకు తరుగుల్ని రసంపై చల్లితే రసం రుచికరంగా ఉంటుంది.