కావలసిన పదార్థాలు :
కందిపప్పు... పావుకిలో
ఎండు మిర్చి...పది
జీలకర్ర... ఒక చెంచా
ఉప్పు... సరిపడా
పోపు దినుసులు... సరిపడా
కరివేపాకు... తగినంత
వెల్లుల్లిపాయ... 3 రేకలు
తయారీ విధానం :
కందిపప్పును మాడకుండా మంచి సువాసన వచ్చేలా వేయించాలి. అది వేగుతుండగానే ఎండుమిర్చి తొడిమలు తీసేసి అందులో వేసి వేయించాలి. ఇవి రెండూ బాగా వేగిన తరువాత సరిపడా ఉప్పు వేసి నీళ్ళు చిలకరిస్తూ రోట్లో మెత్తగా రుబ్బుకోవాలి.
మెత్తగా నలిగిన తరువాత తీసి జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు, పోపు దినుసులతో తాలింపు పెట్టాలి. అంతే కందిపచ్చడి రెడీ. ఇది దోశెలు ఇడ్లీలలోకి చాలా బాగుంటుంది.