Publish Date: Fri, 30 Jun 2023 (14:51 IST)
Updated Date: Fri, 30 Jun 2023 (14:56 IST)
పూరీ చాలా మందికి ఇష్టమైన ఆహారం. చాలా మంది పూరీని ఉబ్బి ఉన్నప్పుడే తింటే బాగుంటుంది. రుచికరమైన పూరీని తయారు చేయాలంటే...?
కావలసినవి:
గోధుమ పిండి-1 కప్పు
రవ్వ-2 టేబుల్ స్పూన్లు
ఉప్పు- తగినంత
తయారీ విధానం:
గోధుమ పిండిలో అవసరమైన ఉప్పు వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా సిద్ధం చేసుకోవాలి. ఇందులో రవ్వను కూడా కలుపుకోవాలి. ఆపై పూరీ కోసం చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల్లా చేసుకోవాలి. ఆపై కడాయిలో నూనె పోసి వేడయ్యాక ఒక్కో పూరీ వేసి వేయించాలి.
పూరీ క్రిస్పీగా ఉండాలంటే గోధుమ పిండిలో రవ్వ లేదా మైదా వేయవచ్చు. ఇవి వేస్తే బాగా ఉబ్బిన పూరీ తయారైనట్లే. అంతేగా పొటాటో మసాలాతో పాటు పూరీని సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.