Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీ స్టాల్ కావాలని డిమాండ్ చేయలేదు.. మందిరం కట్టమన్నా.. గెంటేశారు : ప్రవీణ్ తొగాడియా

విశ్వహిందూ పరిషత్ సంస్థ చీఫ్ ప్రవీణ్ తొగాడియాను ఆ పదవి నుంచి దించేశారు. ఇలా ఆయన్ను తప్పించడానికిగల కారణాలను ఆయన వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, తాను అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని డిమాండ్‌ చేసి

టీ స్టాల్ కావాలని డిమాండ్ చేయలేదు.. మందిరం కట్టమన్నా.. గెంటేశారు : ప్రవీణ్ తొగాడియా
, బుధవారం, 18 ఏప్రియల్ 2018 (16:46 IST)
విశ్వహిందూ పరిషత్ సంస్థ చీఫ్ ప్రవీణ్ తొగాడియాను ఆ పదవి నుంచి దించేశారు. ఇలా ఆయన్ను తప్పించడానికిగల కారణాలను ఆయన వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, తాను అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని డిమాండ్‌ చేసినందుకే వీహెచ్‌పీ నుంచి గెంటేశారని వెల్లడించారు.
 
ముఖ్యంగా, హిందువుల సంక్షేమం కోసం 50 ఏళ్లు కష్టపడినందుకు తనకు దక్కిన ఫలితంగా భావిస్తున్నట్టు చెప్పారు. పైగా, తాను ప్రధాని పదవినో, టీ స్టాల్‌ కావాలనో డిమాండ్‌ చేయలేదనీ, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని మాత్రమే అడిగినట్టు చెప్పారు. తనకు నరేంద్ర భాయ్‌ (ప్రధాని మోడీ)తో వ్యక్తిగత సమస్యలేమీ లేవన్నారు. 
 
రామమందిర నిర్మాణంపై చట్టం చేసే విషయంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మౌనంగా ఉండడమే తనకు చికాకు తెప్పించిందన్నారు. పైగా, తాను పదవులు ఆశించేవాడినే అయివుంటే 2001లోనే ముఖ్యమంత్రి అయ్యేవాడిననీ, కానీ తనకు మోడీతో తనకు సమస్య ఉంటే ఆయన అప్పట్లోనే ముఖ్యమంత్రిని అయ్యేవారే కాదనీ ప్రవీణ్ తొగాడియా తేల్చి చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ నోట్ల రద్దు నాటి పరిస్థితి.. కర్ణాటకలో భారీగా నకిలీ కరెన్సీ...