Publish Date: Fri, 17 May 2024 (19:14 IST)
Updated Date: Fri, 17 May 2024 (20:32 IST)
వేసవిలో వర్షపు జల్లులు. దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. హైదరాబాదులో వర్షం ముంచెత్తింది. తమిళనాడులో కూడా వర్షం బాగానే పడింది. దీనితో కొండప్రాంతంలోని వాటర్ ఫాల్స్ జలకళతో కనిపించాయి. దాంతో పర్యాటకులు తమిళనాడులో కుట్రాళం వాటర్ ఫాల్స్కి క్యూ కట్టారు. ఇక్కడ పర్యాటకులు స్నానం చేస్తుండగా ఒక్కసారి కొండ పైనుంచి వరద ఉధృతమైంది.
దీనితో స్నానం చేస్తున్నవారంతా అక్కడి నుంచి పరుగులు తీసారు. ఓ పెద్దాయన... అడె గొయ్యాల ఇంద పక్క వాడా( అరేయ్ ఇడియట్, ఇటువైపు రారా) అంటూ పెద్దగా కేకలు వేసినా 16 ఏళ్ల బాలుడు రాలేదు. దానితో అతడు ఆ వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.