Publish Date: Thu, 28 Sep 2023 (13:41 IST)
Updated Date: Thu, 28 Sep 2023 (13:44 IST)
హైదరాబాద్ బండ్లగూడ లడ్డూ వేలంపాటలో రికార్డు ధరకు అమ్ముడైంది. బండ్లగూడ జాగీర్లోని సన్సిటీలోని రిచ్మండ్ విల్లాస్లోని గణేష్ లడ్డూ అన్ని రికార్డులను బద్దలు కొడుతూ గురువారం నాడు రూ.1.25 కోట్లకు వేలంపాటలో అమ్ముడైంది. గత ఏడాది లడ్డూ రూ.65 లక్షలకు అమ్ముడు పోయింది.
రిచ్మండ్ విల్లాస్ వాసులు గణేష్ ఉత్సవాల్లో భాగంగా గణేష్ లడ్డూ వేలం నిర్వహిస్తారు. నిర్వాహకుల వెల్లడించిన వివరాల ప్రకారం, వేలంపాట వేయగా వచ్చిన డబ్బును పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛంద సంస్థలకు కిరాణా సామాను సరఫరాతో సహా స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుందని చెప్పారు.